Yoga Narasimha Dolotsavam 2026

ధర్మపురి క్షేత్రం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము

భూషణ వికాస శ్రీధర్మ పురనివాస! దుష్ట సంహార నరసింహ దురితదూర!

క్షేత్రం గురించి

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించే తీరాన వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రం ధర్మపురి. భారతదేశంలోని నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ధామం, శైవ-వైష్ణవ సంప్రదాయాల అరుదైన హరి-హర సామరస్యానికి ప్రతీక. చాళుక్య, రాష్ట్రకూటుల ఆదరణ పొందిన ఈ క్షేత్రం వేద విద్యలకు, సాహిత్యానికి మరియు లలిత కళలకు నిలయం. ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లుతున్న ఈ పుణ్యభూమిలో, తదుపరి గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి.

మరింత చదవండి

దర్శన సమయాలు

ఆలయం ప్రతిరోజు ఉదయం 5:00 గంటలకు సుప్రభాత సేవతో తెరుచుకొని రాత్రి 8:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయితే, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విరామం ఉంటుంది; ఈ సమయంలో దర్శనములకు అనుమతి ఉండదు.

రాబోయే కార్యక్రమాలు

ఉగాది, నృసింహ నవరాత్రులు

బ్రహ్మోత్సవాలు

యోగ నరసింహ డోలోత్సవము

యోగ నరసింహ డోలోత్సవము

కల్యాణోత్సవం

పుట్ట బంగారం