

క్షేత్రం గురించి
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించే తీరాన వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రం ధర్మపురి. భారతదేశంలోని నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ధామం, శైవ-వైష్ణవ సంప్రదాయాల అరుదైన హరి-హర సామరస్యానికి ప్రతీక. చాళుక్య, రాష్ట్రకూటుల ఆదరణ పొందిన ఈ క్షేత్రం వేద విద్యలకు, సాహిత్యానికి మరియు లలిత కళలకు నిలయం. ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లుతున్న ఈ పుణ్యభూమిలో, తదుపరి గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి.
మరింత చదవండిదర్శన సమయాలు
ఆలయం ప్రతిరోజు ఉదయం 5:00 గంటలకు సుప్రభాత సేవతో తెరుచుకొని రాత్రి 8:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయితే, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విరామం ఉంటుంది; ఈ సమయంలో దర్శనములకు అనుమతి ఉండదు.
రాబోయే కార్యక్రమాలు
ఉగాది, నృసింహ నవరాత్రులు
బ్రహ్మోత్సవాలు

